తొలిసారి శాసన మండలిలో అడుగుపెట్టిన సీఎం.. జగన్‌కు షేక్ హ్యాండిచ్చిన డొక్కా..

తొలిసారి శాసన మండలిలో అడుగుపెట్టిన సీఎం.. జగన్‌కు షేక్ హ్యాండిచ్చిన  డొక్కా..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు సాదర స్వాగతం పలికారు. శాసన మండలిలో...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు సాదర స్వాగతం పలికారు. శాసన మండలిలో ప్రవేశించగానే ముందుగా జగన్ సభ్యులు అందరి వద్దకు వెళ్లి నమస్కరించారు. శాసన మండలిలో టీడీపీ పక్ష నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ సీఎం జగన్‌ వద్దకు వెళ్లి స్వాగతం పలికి షేక్ హ్యాండిచ్చారు. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ ఇంత వరకూ శాసనమండలికి వెళ్లలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ మండలిలో అడుగుపెట్టలేదు. కాగా ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయమై శాసనమండలిలో చర్చ జరుగుతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories