దివంగత నేత వై ఎస్ ఆర్ కు నివాళులర్పించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్

దివంగత నేత వై ఎస్ ఆర్ కు నివాళులర్పించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్
x
Highlights

దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా అయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ లోని వైఎస్సార్ సమాధి...

దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా అయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ లోని వైఎస్సార్ సమాధి వద్దకు చేరుకున్నారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, ఇతర కుటుంబ సభ్యులతోపాటు ఘాట్‌కు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున వైఎస్ అభిమానులు హాజరయ్యారు. వారందరికీ ముఖ్యమంత్రి జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈరోజు కడప జిల్లలో పలు కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories