ఎవరిని వదలకండి. బాలిక అత్యాచార ఘటనపై సీఎం వైఎస్ జగన్ సీరియస్

ఎవరిని వదలకండి. బాలిక అత్యాచార ఘటనపై సీఎం వైఎస్ జగన్ సీరియస్
x
Highlights

ఆరేళ్ళ బాలిక పై జరిగిన అత్యాచార ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సీరియస్ అయ్యారు. నిందితులను ఎవరిని వదలకుడదని, వారిపై కఠిన చర్యలు...

ఆరేళ్ళ బాలిక పై జరిగిన అత్యాచార ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సీరియస్ అయ్యారు. నిందితులను ఎవరిని వదలకుడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపి,జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు జగన్. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ అన్నారు. ఇక రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ బాలిక కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు గ్రామంలో రక్షణ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. భాదితురాలు కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేస్తామని, ప్రభుత్వం నుండి అన్ని రకాలుగా సహాయం అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయంపై హోమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడారు. నిందితులను త్వరగా పట్టుకొని,వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి సంఘటలను జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories