ఏపీఎస్ ఆర్టీసీని రవాణాశాఖలో విలీనానికి ఆమోదం

ఏపీఎస్ ఆర్టీసీని రవాణాశాఖలో విలీనానికి ఆమోదం
x
Highlights

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏపీ కేబినేట్‌ ఆమోదం తెలిపింది. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రజా రవాణా శాఖలోకి తీసుకుంటామని ప్రభుత్వ ఉద్యోగుల...

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏపీ కేబినేట్‌ ఆమోదం తెలిపింది. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రజా రవాణా శాఖలోకి తీసుకుంటామని ప్రభుత్వ ఉద్యోగుల నియమ నిబంధనలు వారికి కూడా వర్తిస్తాయని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ అంతా వచ్చే 3 నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సహకాలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఇందుకు ప్రస్తుతానికి 5 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. జాతీయస్థాయిలో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధిస్తే 5 లక్షలు, సిల్వర్ మెడల్ సాధిస్తే 4 లక్షలు, కాంస్యం సాధిస్తే 3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే గత ఐదేళ్ల కాలంలో ప్రతిభ కనబర్చినా మరుగున పడ్డవారికి కూడా ప్రోత్సహాకాలను అందజేస్తామని మంత్రి నాని తెలిపారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories