సభనా..? చేపల మార్కెటా?: స్పీకర్ తమ్మినేని

సభనా..? చేపల మార్కెటా?: స్పీకర్ తమ్మినేని
x
Highlights

సున్నా వడ్డీపై సీఎం జగన్, చంద్రబాబు మధ్య సవాల్ ప్రతి సవాల్ నడిచాయి. టీడీపీ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని ఆధారాలతో సహా నిరూపిస్తే...

సున్నా వడ్డీపై సీఎం జగన్, చంద్రబాబు మధ్య సవాల్ ప్రతి సవాల్ నడిచాయి. టీడీపీ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని ఆధారాలతో సహా నిరూపిస్తే ప్రతిపక్ష నేత రాజీనామా చేస్తారా అంటూ సీఎం జగన్ విసిరిన సవాల్‌కు చంద్రబాబు స్పందించారు. ఐదేళ్ల తన పాలనలో వడ్డీలేని రుణాలు ఇచ్చినట్టు లెక్కలు చూపిన చంద్రబాబు ఇప్పుడు సీఎం రాజీనామా చేస్తారా? ప్రజలకు క్షమాపణ చెబుతారా అంటూ ప్రతి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సభలో సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభనా....? లేక చేపల మార్కెట్టా అంటూ వ్యాఖ్యానించారు. సభ్యుల తీరును ప్రజలు గమనిస్తున్నారని గుర్తించుకోవాలని స్పీకర్ సూచించారు. ముఖ్యమంత్రి, విపక్ష నేత మాట్లాడేవేళ, వారికి ఎవరూ అడ్డుతగల వద్దని కోరారు. సభను తాను హుందాగా నడిపించాలని కోరుకుంటున్నానని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తమ్మినేని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories