మాకు కనీసం ఛాంబర్ ఇవ్వకుండా అవమానించారు: గడికోట శ్రీకాంత్ రెడ్డి

మాకు కనీసం ఛాంబర్ ఇవ్వకుండా అవమానించారు: గడికోట శ్రీకాంత్ రెడ్డి
x
Highlights

మేనిఫెస్టోను అమలు చేసే విధంగా తొలి క్యాబినెట్ సమావేశంలోనే చర్యలు తీసుకోవడం గర్వకారణమని రాష్ట్ర ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు....

మేనిఫెస్టోను అమలు చేసే విధంగా తొలి క్యాబినెట్ సమావేశంలోనే చర్యలు తీసుకోవడం గర్వకారణమని రాష్ట్ర ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపటి నుంచి సమావేశమవుతాయని చెప్పారు. తొలుత సీఎం వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని, అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తారని తెలిపారు. గురువారం స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని, 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారని చెప్పారు.సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తామని శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాన్ని కూడా గౌరవించి సభలో అవకాశం ఇస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులైన తమకు ఛాంబర్ కూడా ఇవ్వకుండా అవమానించిందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కానీ తాము మాత్రం అందరికీ సరైన ప్రాధాన్యత కల్పిస్తామని తేల్చిచెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories