నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు... రేపు సభలో బడ్జెట్

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు... రేపు సభలో బడ్జెట్
x
Highlights

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రేపు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు....

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రేపు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు కూడా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు. శని, ఆదివారాలు మినహా 14 రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. సభ్యులు కోరితే ఈ సమావేశాలు మరిన్ని రోజులు పెంచే అవకాశం ఉంది. అయితే, కరువు, విత్తనాలు, టీడీపీ నేతలపై దాడులకు సంబంధించి చర్చ జరపాలని టీడీపీ కోరింది. అయితే, ఈ అసెంబ్లీ సమావేశాలు హాట్‌ హాట్‌గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష సభ్యులు వాగ్వాదం, మాటల యుద్ధం తొలిరోజు నుంచి మొదలయ్యే పరిస్థితి నెలకొంది. ఓ వైపు ప్రజావేదిక కూల్చేయడం, మరోవైపు టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులపై జరుగుతున్న దాడులపై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుపట్టనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories