Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఏసీబీ సోదాలు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఏసీబీ సోదాలు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా మాచర్ల రెవెన్యూ కార్యాలయం సందర్శించిన ఏసీబీ సీఐ శ్రీధర్...

ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా మాచర్ల రెవెన్యూ కార్యాలయం సందర్శించిన ఏసీబీ సీఐ శ్రీధర్ రికార్డులు తనిఖీలు చేశారు. వివరాలు సేకరించారు. అనంతపురం జిల్లాలోనూ ఏసీబీ అదికారులు తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ తహశీల్దార్, సిబ్బంది ఉండగానే కార్యాలయానికి తాళాలు వేసి సోదాలు చేపట్టారు ఏసీబీ అదికారులు.

రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తహసీల్దార్‌ కార్యాలయాల్లో రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట, వడమాల, పుత్తూరు, నగరి తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. నెల్లూరు జిల్లాలో.. సూళ్లూరుపేట, కావలి, ముదిగుప్ప, తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ... శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, కర్నూలు జిల్లా కల్లూరు, ప్రకాశం జిల్లా పొన్నలూరు.. విశాఖ జిల్లాలో సబ్బవరం, భీమిలి, తూ.గో జిల్లా పెద్దాపురం, కడప జిల్లాలో బ్రహ్మంగారిమఠం.. విజయనగరం జిల్లా వేపాడు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories