ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ..

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లోని సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం .. ఇకపై ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన సేవలను అందిచేందుకు శ్రీకారం చుట్టింది ....

ఆంధ్రప్రదేశ్ లోని సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం .. ఇకపై ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన సేవలను అందిచేందుకు శ్రీకారం చుట్టింది . అంతేకాకుండా మెడికల్ బిల్ వేయి రూపాయలు దాటితే వాటిని ఆరోగ్యశ్రీ కిందికి కన్వర్ట్ చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదాయం అయిదు లక్షల రూపాయలు ఉన్నవారికి కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రతి ఒక్క కుటుంబానికి క్యూర్ కోడ్‌తో కూడిన హెల్త్ కార్డ్ ఇవ్వనుంది. ఆరోగ్యశ్రీ ద్వారా 2వేలకు పైగా వ్యాధులకు చికిత్స అందించనున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని 150 ఆస్పత్రుల్లో నవంబరు నుంచి ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉంటాయి. మొదటగా దీనిని జనవరి 1 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఈ స్కీమ్‌ను ప్రారంభించనున్నారు. అ తర్వాత రాష్ట్రమంతటా దీనిని అమలు చేయనున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories