జేసీ దివాకర్‌రెడ్డికి మరో షాక్

జేసీ దివాకర్‌రెడ్డికి మరో షాక్
x
Highlights

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. తాజాగా మరోసారి జేసీ ట్రావెల్స్‌కు సంబంధించిన వాహనాలను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు....

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మరో షాక్ తగిలింది. తాజాగా మరోసారి జేసీ ట్రావెల్స్‌కు సంబంధించిన వాహనాలను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. బీఎస్-3 వాహనాలను.. బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్లు నిర్ధారణ కావడంతో మరికొన్ని వాహనాలు సీజ్ అయ్యాయి. వీటిని నాగాలాండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్టు అధికారులు గుర్తించారట. గతంలో జేసీ బ్రదర్స్‌కు చెందిన ట్రావెల్స్‌కు సంబంధించిన 57 వాహనాలను సీజ్ చేసిన అధికారులు తాజాగా నేడు 4 టిప్పర్లను సీజ్ చేశారు. మొత్తం 154 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తామన్న డీటీసీ శివరామప్రసాద్ తెలిపారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories