హాట్స్ ఆఫ్ పోలీసన్న.. మీ త్యాగాలను మరవం

హాట్స్ ఆఫ్ పోలీసన్న.. మీ త్యాగాలను మరవం
x
Highlights

కరోనా వైరస్ ని అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..

కరోనా వైరస్ ని అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇక పోలీసులు, వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. అయితే ఇవేమీ పట్టనట్టుగా జనాలు రోడ్లపైన తిరుగుతున్నారు. అయితే కొన్నిచోట్లల్లో రోడ్లపైన తిరుగుతున్న వారికీ పోలీసులు చేతులెత్తి మొక్కుతున్నారు. మరికొన్ని చోట్లల్లో వారి లాఠీలకు పని చెప్పక తప్పడం లేదు. దీనివల్ల అమాయకుల్ని కొడుతున్నారనే విమర్శలను సైతం పోలీసులు ఎదురుకున్నారు. అయితే ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ అవుతుంది.

తన విధులను నిర్వహించి ఇంటికి వచ్చిన ఓ సాధారణ ఎస్సై తన భార్య, పిల్లలను ఇంట్లోనే ఉంచి బయట భోజనం చేస్తూ ఉండడం,పిల్లలు ఇంట్లో నుంచి తండ్రిని అమాయకంగా చూస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో నెటిజన్లుని కదిలిస్తోంది. మనం కోసం పోలీసులు పడుతున్న కష్టానికి హాట్స్ ఆఫ్ అనకుండా ఉండలేం, మీ త్యాగాలను మరవం అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ ఫోటో ఏపీకి చెందినదగా తేలగా.. ఆ అధికారి వివరాలు తెలియలేదు.

తాజాగా ఇలాంటి ఫోటో మరొకటి సోషల్ మీడియాని కదిలించింది.. విధులు నిర్వర్తించి వ‌చ్చిన ఓ పోలీస్ అధికారి స‌ప‌రేట్‌గా కూర్చొని తింటుంటే, ఆ ఫ్యామిలీ మొత్తం ఆయ‌న‌కి దూరంగా నిల్చొని ఉంది. సొంత ఇంట్లోనే కన్న బిడ్డలకు దూరంగా... మనల్ని ఇళ్లల్లోనే ఉండి బయటకి వెళ్ళినప్పుడు సామాజిక దూరం పాటించమంటుంటే మనలో కొందరికి సీరియస్ నెస్ లేదు. లాక్ డౌన్ సూచనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. రోడ్ల మీద కానీ పోలీసులు మాత్రం రోజంతా బయట తిరిగే తమ వల్ల తమ కుటుంబానికి ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అనే భయంతో తమ సొంత ఇంట్లోనే కుటుంబ దూరం పాటించాల్సి వస్తోంది. దయచేసి లాక్ డౌన్ ని ప్రతి ఒక్కరం పాటిద్దాం అని కోరుతున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories