ఏపీలో మరో 68 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మరో 68 కరోనా పాజిటివ్ కేసులు
x
Highlights

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. కొత్తగా మరో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,407 కి చేరాయి....

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. కొత్తగా మరో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,407 కి చేరాయి. గడిచిన 24గంటల్లో ఒకరు మృతి చెందినట్టు హెల్త్ బులిటెన్ లో తెలిపారు.

ఏపీలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజా మరో 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) 9,159 సాంపిల్స్ ని పరీక్షించగా 68 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. 43 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు. కోవిడ్ వల్ల కర్నూల్ లో ఒక్కరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 53కు చేరింది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1639కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 715 మంది చికిత్స పొందుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories