ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కేవైసీ కష్టాలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కేవైసీ కష్టాలు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ-కేవైసీ చేయించుకోకపోతే రేషన్‌ సరుకులతోపాటు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయంటూ ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ-కేవైసీ చేయించుకోకపోతే రేషన్‌ సరుకులతోపాటు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయంటూ ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పిల్లాపాపలతో రేషన్ డిపోలు, ఆధార్ కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తెల్లరేషన్ కార్డుదారులను ఈ-కేవైసీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ-కేవైసీ చేయించుకోకపోతే రేషన్‌ సరుకులతోపాటు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయన్న పౌరసరఫరాలశాఖ అధికారుల హెచ్చరికలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారంతా తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని, లేదంటే సరుకులు ఇచ్చే పరిస్థితి ఉండదని తేల్చిచెప్పడంతో పిల్లాపాపలతో కలిసి అటు రేషన్ డిపోలకు ఇటు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.

ఈ-కేవైసీ చేయించుకోని జాబితాను రేషన్ డీలర్లకు అందజేసిన సివిల్ సప్లై అధికారులు వేలిముద్రలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, ఈ-పోస్ మెషీన్లు మొరాయిస్తుండటంతో ఈ-కేవైసీ ముందుకుసాగడం లేదు. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మండలంలోనూ ఈ-కేవైసీ చేయించుకోనివారి సంఖ్య వేలల్లో ఉండటంతో ఇది ఎప్పుడు పూర్తవుతుందనే ప్రశ్నార్ధకంగా మారింది. అయితే, సివిల్ సప్లై అధికారుల హెచ్చరికలతో తెల్లరేషన్ కార్డుదారులు తమ పనులు మానుకుని రోజుల తరబడి రేషన్ డిపోల ముందు పడిగాపులు పడుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories