Andhra Pradesh: శాసనమండలి చైర్మన్ తో గవర్నర్ భేటీ

Andhra Pradesh: శాసనమండలి చైర్మన్ తో గవర్నర్ భేటీ
x
Highlights

ఏపీలో ప్రస్తుత రాజకీయాలు హాట్ గా ఉన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్‌తో మండలి చైర్మన్ షరీఫ్ భేటీ అయ్యారు. ఇటీవల...

ఏపీలో ప్రస్తుత రాజకీయాలు హాట్ గా ఉన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్‌తో మండలి చైర్మన్ షరీఫ్ భేటీ అయ్యారు. ఇటీవల రాజధాని వికేంద్రీకరణ బిల్లును షరీఫ్, సెలక్ట్ కమిటీ పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌తో చైర్మన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

రెండు బిల్లుల రద్దు వ్యవహారంపై శాసనసభ, మండలిలో ఇటీవల జరిగిన పరిణామాలపై గవర్నర్ ఆరా తీసినట్టు సమాచారం. కౌన్సిల్ లో జరిగిన పరిణామాల గురించి గవర్నర్ కు షరీఫ్ లు వివరించినట్టు తెలుస్తోంది. కాగా, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో గవర్నర్ నిన్న భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ను స్పీకర్, చైర్మన్ కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories