Andhra Pradesh Live Updates: ఆంధ్రప్రదేశ్ జిల్లాల తాజా వార్తలు

చిత్తూరు జిల్లా:

చిత్తూరు జిల్లా రామకుప్పంలో కిడ్నాప్‌ కలకలం రేగింది. ఓ మహిళా టీచర్‌ను కిడ్నాప్‌ చేసి సుమోలో తీసుకెళ్తుండగా పోలీసులు చేజ్‌ చేసి పట్టుకున్నారు. కిడ్నాప్‌కు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కిడ్నాపర్లు వాడిన సుమోను స్వాధీనం చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా:

ప్రకాశం జిల్లా నుండి కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. 3 లారీల్లో తరలిస్తున్న 90 టన్నుల రేషన్‌ బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

నెల్లూరు జిల్లాలో:

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఓ స్కూటర్ లో పాము కన్పించడం కలకలం రేపింది. స్కూటర్ సీటు కవర్‌ తీయడంతో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమయ్యింది. దీంతో మెకానికి భయాందోళనకు గురయ్యాడు. ఎట్టకేలకు బండిలో దాక్కున్న పామును బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కర్నూలు జిల్లా:

బనగానపల్లె నియోజకవర్గం వ్యాప్తంగా అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. కోత నూర్పిడి దశలో ఉన్న తరుణంలో వర్షం అన్నదాతను ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికే కోత కోసిన పంట కూడా కళ్లల్లో ఉండటంతో వర్షానికి తడిసిముద్దయ్యింది.

నెల్లూరు జిల్లాలో:

నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలతో అన్నదాతకు మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. కోత దశలో ఉన్న వరి పైర్లు నీట మునిగాయి. నూర్పిడి చేసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. గూడూరు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్లలో

Show Full Article
NO MORE UPDATES
Print Article
Next Story
More Stories