సెర్బియ పోలీసుల అదుపులో నిమ్మగడ్డ..కేంద్రమంత్రికి లేఖరాసిన వైసీపీ ఎంపీలు

సెర్బియ పోలీసుల అదుపులో నిమ్మగడ్డ..కేంద్రమంత్రికి లేఖరాసిన వైసీపీ ఎంపీలు
x
Highlights

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ కేసులో రస్ అల్ ఖైమాకు చెందిన...

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ కేసులో రస్ అల్ ఖైమాకు చెందిన ప్రతినిధుల ఫిర్యాదుతో బెల్‌గ్రేడ్‌లో నిమ్మగడ్డను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆయన్ను స్వదేశానికి సురక్షితంగా రప్పించేందుకు వైసీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు.

వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రస్ అల్ ఖైమాకు చెందిన ప్రతినిధుల ఫిర్యాదుతో బెల్‌గ్రేడ్‌లో నిమ్మగడ్డను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వాన్‌పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా ఫిర్యాదు చేసింది. రస్‌ అల్‌ ఖైమా నూతన సీఈవో ఫిర్యాదుతో ఇంటర్‌పోల్‌ రంగంలోకి దిగింది.

సెర్బియాలో విహారయాత్రకు వెళ్లగా అక్కడే ఆయన్ను పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే నిమ్మగడ్డను భారత్‌కు తీసుకువచ్చేందుకు వైసీపీ ఎంపీల ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు సెర్బియాతో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగమంత్రి జైశంకర్‌కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. నిమ్మగడ్డను అరెస్ట్ చేయకుండా సురక్షితంగా ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో ఎంపీలు కోరారు. ప్రస్తుతం ఈ లేఖ చర్చనీయాంశమైంది. అయితే, నిమ్మగడ్డకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. దీంతో నిమ్మగడ్డ ప్రసాద్‌ను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు వైసీపీ ఎంపీలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories