విశాఖ కు రాజధాని వచ్చితీరుతుంది : విజయసాయిరెడ్ధి

విశాఖ కు రాజధాని వచ్చితీరుతుంది : విజయసాయిరెడ్ధి
x
Highlights

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మూడు రాజధానులపై మరోసారి కీలక ప్రకటన చేశారు. విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. నేడు విశాఖలో మీడియాతో...

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మూడు రాజధానులపై మరోసారి కీలక ప్రకటన చేశారు. విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. నేడు విశాఖలో మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఈ సంద్భంగా విశాఖ పరిపాలన రాజధాని అని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆగదని దాన్ని ఆపే శక్తి ఎవరీకి లేదని వ్యాఖ్యానించారు. అయితే అది ఎప్పుడు అనే అంశంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. ఒక వైపు కరోనా వైరస్ నేపథ్యంలోనూ ఇప్పటికీ రాజధాని ప్రాంత రైతులు, కూలీలు వారి ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో విజయసాయి మాటలు హాట్ టాపిక్ గా నిలిచాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories