సీఎం అధ్యక్షతన నేడు రెండో రోజు కలెక్టర్ల సదస్సు

సీఎం అధ్యక్షతన నేడు రెండో రోజు కలెక్టర్ల సదస్సు
x
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు కలెక్టర్ల సదస్సులో పాల్గొనున్నారు. తొలి రోజు వివిధ సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన...

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు కలెక్టర్ల సదస్సులో పాల్గొనున్నారు. తొలి రోజు వివిధ సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రెండో రోజు శాంతి భద్రతలపై అంశంపై చర్చించనున్నారు. 13 జిల్లాల ఎస్పీలతో పాటు వివిధ విభాగాల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా అత్యంత కీలకమైన బెల్ట్ షాపుల తొలగింపు, మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. నిన్నటి సమావేశంలో ప్రజా వేదికను కూల్చాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి జగన్‌ ఏయే అంశాలను ప్రస్తావిస్తారనేది ఆసక్తిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశముంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories