ప్రియుడు మోజులో పడి ఓ భార్య తన భర్తనే కడతేర్చింది .. కానీ ఓ అజ్ఞాతవ్యక్తి చెప్పిన నిజంతో అసలు కథ బయటపడింది .. ఇక వివరాల్లోకి వెళ్తే .. కృష్ణ జిల్లా...
ప్రియుడు మోజులో పడి ఓ భార్య తన భర్తనే కడతేర్చింది .. కానీ ఓ అజ్ఞాతవ్యక్తి చెప్పిన నిజంతో అసలు కథ బయటపడింది .. ఇక వివరాల్లోకి వెళ్తే .. కృష్ణ జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన గోపికృష్ణకి మౌనిక అనే యువతితో మూడేళ్ళ కింద వివాహం అయింది .. అయితే మౌనికకి వివాహానికి ముందే నీలం శివ అనే వ్యక్తితో అక్రమసంబంధం ఉంది .. కొన్ని రోజుల తర్వాత మౌనిక , నీలం శివ తమ దూరపు బంధువు అని గోపికృష్ణకి పరిచయం చేసింది , తరచుగా ఇంటికి రావడంతో శివ మరియు గోపికృష్ణకి మంచి స్నేహం ఏర్పడింది..
తరచుగా ప్రియుడిని కలేసేందుకు ఇబ్బంది కలగడంతో ప్రియుడుతో కలిసి భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది.. ఈ క్రమంలోనే జూన్ 30న మద్యం సేవించేందుకు నీలం శివ మరియు గోపికృష్ణ ఇద్దరు కలిసి మామిడితోటకు వెళ్లారు . ప్లాన్ ప్రకారం అతడు బాగా తాగాకా అతన్ని ప్లాస్టిక్ కవర్ తో భర్త మొఖానికి చుట్టేసి ఉపరి ఆడకుండా చంపేసింది .. మొదటగా బాగా తాగి గుండెపోటుతో అతను చనిపోయి ఉంటాడని అందరు అనుకున్నారు. పోలీసులకు కూడా ఎక్కడ కూడా డౌట్ రాలేదు ..
కానీ పోస్ట్ మార్టం తరవాత ఇది హత్యే అని తెలియడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసారు. కానీ ఎక్కడ కూడా ఆధారాలు లభించలేదు .. అయితే పోలిసులుకు ఓ అజ్ఞాతవ్యక్తి నుండి ఫోన్ వచ్చింది . గోపికృష్ణని నీలం శివ బైక్ పై తీసుకొని వెళ్తుండగా చూశానని అతను చెప్పడంతో ఎవరు ఈ శివ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా ఆసలు నిజాలు బయటకు వచ్చాయి .. పోలీసులు తమదైన స్టైల్ లో విచారించగా నిజాన్ని మొత్తం ఒప్పేసుకున్నారు ..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire