ఇద్దరు స్నేహితులు .. అక్రమసంబంధం ... హత్య!

ఇద్దరు స్నేహితులు .. అక్రమసంబంధం ... హత్య!
x
Highlights

రోజురోజుకు వివాహేతర సంబంధాలు పెరుగిపోతున్నాయి ..దానితో పాటు హత్యలు కూడా ఎక్కువగానే పెరుగుతున్నాయి . తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని తణుకు...

రోజురోజుకు వివాహేతర సంబంధాలు పెరుగిపోతున్నాయి ..దానితో పాటు హత్యలు కూడా ఎక్కువగానే పెరుగుతున్నాయి . తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని తణుకు మండలం దువ్వలోని సూర్యారావుపాలెంలో చోటు చేసుకుంది . ఒక వివాహేతర సంబంధం ఇద్దరి స్నేహాన్ని విడగొట్టడమే కాకుండా ఒకరి హత్యకి దారి తీసింది . దీనికి సంబంధించిన వివరాలను కొవ్వూరు డీఎస్పీ కే.రాజేశ్వరరెడ్డి వెల్లడించారు...

ఇక వివరాల్లోకి వెళ్తే .. మొగల్తూరు గ్రామానికి చెందిన గుడాల శివరామకృష్ణ, దువ్వ గ్రామానికి చెందిన కామన బాలాజీలు గతంలో గల్ఫ్‌ దేశానికి వెళ్లి స్నేహితులయ్యారు. అక్కడి నుండి వచ్చాక బాలాజీ, రామకృష్ణ సహజీవనం చేస్తున్న యువతితో స్నేహం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగించాడు.ఈ విషయం తెలుసుకున్న శివరామకృష్ణ బాలాజీని పలుసార్లు హెచ్చరించాడు. అయిన బాలాజీ వినలేదు . దీనితో ఆ యువతిని గల్ఫ్‌ దేశానికి పంపించాడు.

అయినా బాలాజీ మారకుండా తరుచు అ అమ్మాయితో మాట్లాడుతూ ఉండడంతో బాలాజీ పై కక్ష పెంచుకున్నాడు శివరామకృష్ణ ... ఇదే విషయంపై శుక్రవారం బాలాజీని కలిసి రాత్రి 9 గంటలకు దువ్వ బ్రాంది షాపులో ఇద్దరు మద్యం తాగారు. ఆ సమయంలో బాలాజీ అతని ముందే ఆ యువతితో ఫోన్‌లో మాట్లాడడంతో శివరామకృష్ణ ఆగ్రహంతో తన దగ్గర ఉన్న చాకుతో అతని పీక కోసి పరారయ్యాడు పోలీసులు అతన్ని గాలించి అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories