ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో (సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకూ)...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో (సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకూ) 8,148 సాంపిల్స్ ని పరీక్షించగా.. 48 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. అలాగే 55 మంది కోవిడ్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మరణించాడు.

ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2719కు చేరుకుంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 759 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 57కు చేరుకుంది. మొత్తంగా 1903 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories