అంతుచిక్కని కిడ్నాప్ మిస్టరీ..కిడ్నాపర్లు ఫోన్ ఎందుకు చేయలేదు..?

అంతుచిక్కని కిడ్నాప్ మిస్టరీ..కిడ్నాపర్లు ఫోన్ ఎందుకు చేయలేదు..?
x
Highlights

అప్పటి వరకు ఆడుకుంటూ గడిపిన బాబు ఏమైయ్యాడు...? చిట్టిపొట్టి అడుగులు వేస్తూ నాన్నమ్మ వెంట వెళ్లిన జషిత్‌ను ఎవరు ఎత్తుకుపోయారు...? ఇది.. తెలిసిన వారి...

అప్పటి వరకు ఆడుకుంటూ గడిపిన బాబు ఏమైయ్యాడు...? చిట్టిపొట్టి అడుగులు వేస్తూ నాన్నమ్మ వెంట వెళ్లిన జషిత్‌ను ఎవరు ఎత్తుకుపోయారు...? ఇది.. తెలిసిన వారి పనేనా.. లేక ఎవరైనా పగబట్టి చేశారా..? అసలు కిడ్నాపర్లు ఎందుకు ఫోన్ చేయలేదు..? కిడ్నాప్ చేయడానికి కారణం ఏమిటి..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిని తొలిచేస్తున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నిన్న కిడ్నాప్‌ అయిన బాబు జషిత్ ఆచూకీ 19 గంటలు దాటినా తెలియలేదు. ఇంటికి దగ్గరలో ఉన్న గ్రౌండ్‌లో అడుకోవడానికి వెళ్లి నాన్నమ్మతో తిరిగి వస్తుండగా జషిత్‌ను ఎత్తుకుపోయారు. వారు ఉంటున్న అపార్ట్‌మెంట్ మెట్లు ఎక్కుతుండగానే వెనుక నుంచి వచ్చిన కిడ్నాపర్‌ జషిత్‌ నాన్నమ్మపై దాడి చేసి అతడిని ఎత్తుకుపోయాడు.

బాబు కిడ్నాప్ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కరెంట్ లేదు. దీంతో కిడ్నాపర్‌ను గుర్తించలేకపోయానని బాబు నాన్నమ్మ చెబుతున్నారు. వెనుక వెంబడించినా చీకట్లో కనిపించలేదని ఆమె చెబుతోంది. మరోవైపు బాబు రోజు 6 గంటల సమయంలోనే ఆడుకోవడానికి వెళ్లి వస్తుంటాడు. ఇది గమనించే కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

విషయం తెలిసి వెంటనే పోలీసులు బాబు కోసం గాలింపు మొదలు పెట్టారు. జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టారు. కిడ్నాప్ వెనుక కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాబు కుటుంబంపై ఎవరైనా పగబట్టారా..? లేక ఇది తెలిసిన వారి పనేనా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.

కిడ్నాపైన జషిత్ యూకేజీ చదువుతున్నాడు. బాబు తల్లిదండ్రులు ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వీరు మండపేటలోని వేర్వేరు బ్యాంకుల్లో పీవోలుగా పనిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బాబు తండ్రి బైక్‌ను ఎవరో ఎత్తుకుపోయారు. బ్యాంకు వద్ద తాళం వేసి ఉన్న బైక్ మాయమైంది. ఈ నేపథ్యంలో వారి కుటుంబంపై ఎవరికైనా కక్ష ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories