ఏపీలో‌ 23కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో‌ 23కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
x
Highlights

ఏపిలో కరోనా పాజిటివ్ కేసుల 23కు చేరుకున్నాయి. ఢిల్లీ మత ప్రార్ధనకు వెళ్ళి వచ్చిన ఇద్దరికి తాజాగా కరోనా పాజిటివ్ తేలింది. గత రాత్రి మొత్తం 33...

ఏపిలో కరోనా పాజిటివ్ కేసుల 23కు చేరుకున్నాయి. ఢిల్లీ మత ప్రార్ధనకు వెళ్ళి వచ్చిన ఇద్దరికి తాజాగా కరోనా పాజిటివ్ తేలింది. గత రాత్రి మొత్తం 33 శాంపిల్స్ లో రెండు పాజిటివ్ గా వచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తాజాగా రాజమండ్రి, కాకినాడలో రెండు కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి ప్రకటించరు. రాజమండ్రికి చెందిన 72 సంవత్సరాల వ్యక్తికి, కాకినాడకు చెందిన 49 సంవత్సారాల వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబ సభ్యులను ఐసోలేషన్ కు తరలించారు. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు మూడుకు చేరాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రత్తమైంది. జిల్లాలో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. మున్సిపల్ సిబ్బంది బ్లీచింగ్, హైడ్రో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories