ఏపీలో మరో 125 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో మరో 125 కరోనా పాజిటివ్‌ కేసులు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 125 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 14,246...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 125 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 14,246 శాంపిల్స్‌ని పరీక్షించగా 125 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 34 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో ఒక్క కరోనా మరణం సంభవించలేదు.

రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కేసులు 3843. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 75. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,387కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 1381 మంది చికిత్స పొందుతున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories