ఫోటో వైరల్ : వినాయకుడి విగ్రహానికి వైసీపీ రంగులు...

ఫోటో వైరల్ :  వినాయకుడి విగ్రహానికి వైసీపీ రంగులు...
x
Highlights

వినాయకుడి విగ్రహాలు రోజురోజుకు కొత్త డిజైన్ తో వస్తున్నాయి . ఒకప్పడు మట్టి విగ్రహాలు , అ తర్వాత రసాయనాల రంగులతో కూడిన ప్లాస్టర్ అఫ్ ప్యారిస్ వినాయక...

వినాయకుడి విగ్రహాలు రోజురోజుకు కొత్త డిజైన్ తో వస్తున్నాయి . ఒకప్పడు మట్టి విగ్రహాలు , అ తర్వాత రసాయనాల రంగులతో కూడిన ప్లాస్టర్ అఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలను మొదలు పెట్టారు. వినాయకుడిని వివిధ రూపాల్లో తయారు చేయడం మొదలు పెట్టారు . కొన్నాళ్ళగా సినిమాలలో బాగా ప్రేక్షకాదరణ పొందిన పాత్రలుతో కూడిన విగ్రహాలను తయారుచేస్తున్నారు .. గతంలో బాహుబలి వినాయకుడు ఎంత ఫేమస్ అయ్యిందో పెద్దగా చెప్పాలిసిన అవసరం లేదు .. అయితే తాజాగా వినాయకుడి విగ్రహానికి వైసీపీ రంగులు అద్దిన ఘటన వెలుగులోకి వచ్చింది .ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా కలర్స్ అయిన నీలం, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులను అద్దడం చర్చనీయాంశంగా మారింది . ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories