Next


ఈ రోజు ప్రశ్న
అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసం వెనుక రాజకీయకుట్ర ఉందని భావిస్తున్నారా..?
a. అవును
b. కాదు

    

Result Charts: Pie, Vertical Bar
రాష్ట్రీయం
Photo

నేడే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ: సాయంత్రం 6.25కి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

    రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై ఎప్పుడన్నది తేలిపోయింది. సోమవారం మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. సాయంత్రం 6.25కి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. మొత్తం ముగ్గురికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఈ మేరకు రాజ్ భవన్ కు సమాచారం అందింది. ఊహించినట్టుగానే సీఎం సన్నిహితుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కొండ్రుమురళి, ప్రసాద్ లకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. భట్టి విక్రమార్కల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అటు మంత్రి పదవి ఆశించిన గండ్ర వెంకటరమణారెడ్డికి చీఫ్ విప్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.     

     అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. హుజూర్ నగర్ ఎమ్మెల్యే. మంత్రి వర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ఖరారైంది. ముఖ్యమంత్రికి సన్నిహితుడవడం, వివాదరహితుడు కావడం.. ఉత్తమ కుమార్ రెడ్డికి కలిసొచ్చాయి. మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అగ్రికల్చరల్ బిఎస్సీ చదవి, భారత వైమానిక దళంలో పైలట్ గా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సేవలందించారు.

   అయితే తనకిచ్చిన ఏ బాధ్యతనైనా సమర్ధవంతంగా నిర్వహిస్తానని ప్రభుత్వ విప్ కొండ్రు మురళి అన్నారు. మంత్రి పదవి ఇచ్చినందుకు సోనియా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై ఎప్పుడన్నది తేలిపోయింది. సోమవారం మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. సాయంత్రం 6.25కి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. మొత్తం ముగ్గురికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఈ మేరకు రాజ్ భవన్ కు సమాచారం అందింది.
మద్యం సిండికేట్లతో సంబంధాలున్న వారిపై ఎసీబీ దాడులను ముమ్మరం చేసింది. మద్యం సిండికేట్లతో సంబంధముందంటూ కృష్ణా జిల్లా తెల్లప్రోలు మాజీ వీఆర్ఓ రామ్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. మరోవైపు ఖమ్మం జిల్లాలోనూ ఎసీబీ అధికారులు దాడుల నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో రాజకీయ, పరిపాలనా పరమైన అనిశ్చితి కొనసాగుతోంది. రాష్ట్ర క్యేడర్ ఐఎఎస్సులంతా కట్టగట్టుకుని ముఖ్యమంత్రిని కలిసి సిబిఐపై అక్కసు వెళ్లగక్కడం, తదనంతరం వివిధ పక్షాల నుంచి వెల్లువెత్తిన అభిప్రాయాలు రాష్ట్రంలో నెలకొన్న గందరగోళానికి అద్దం పడుతున్నాయి.
రైతుపోరుబాటలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం ఆయన కావలికి చేరుకున్నారు. కావలిలో తెలుగు తమ్ముళ్లు బాబుకు ఘనస్వాగతం పలికారు. కావలి నుంచి ఉదయగిరి నియోజకవర్గంలోని ఆరుగ్రామాల్లో మొత్తం 13కిలో మీటర్ల మేర బాబు పాదయాత్ర చేయనున్నారు.
ఫీజురీయింబర్స్ మెంట్ చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా 7వ తేదీ నుంచి ఇంజనీరింగ్, వృత్తివిద్యా కళాశాలలు నిరవధికంగా మూసివేయనున్నారు. హైదరాబాద్ స్టాన్లీ కళాశాలలో జరిగిన ఇంజనీరింగ్ వృత్తివిద్యాకళాశాలల సమాఖ్య సర్వసభ్య సమావేశంలో ఫీజురీయింబర్స్ మెంట్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాలేజీల మూసివేత నిర్ణయానికి రాష్ట్రంలోని మైనార్టీ కళాశాలల యాజమాన్యాలు సైతం మద్దతునిచ్చాయి.
జూనియర్ డాక్టర్ల నిరవధిక నిరాహారదీక్ష 12వ రోజుకుచేరుకుంది. రెండవదఫా నిరవధిక నిరాహారదీక్షకు దిగిన 12మంది జూడాల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసియుకి తరలించారు. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం అవలంభిస్తున్న మొండివైఖరిని జూడాలు తీవ్రంగా నిరసిస్తున్నారు.
ఓఎంసీ ఎమ్మార్ కేసుల్లో చార్జీషీట్ దాఖలు చేసిన సీబీఐ ఇక జగన్ ఆస్తుల కేసులపై దర్యాప్తు ముమ్మరం చేసింది. వైయస్ హయాంలో లబ్ది పొంది అనంతరం జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలపై సీబీఐ ఇప్పటికే సాక్ష్యాలను సేకరించింది. మరింత సమాచారం సేకరించేందుకు ఐఏఎస్ అధికారులను సీబీఐ విచారిండంపై ఐఏఎస్ అధికారుల సంఘం మండిపడుతోంది. అటు సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ ఢిల్లీ వెళ్లిన ఆయన ఐఏఎస్ ల విచారణపై సీబీఐ డైరెక్టర్ ఎపి సింగ్ తో చర్చించనున్నట్టు తెలుస్తోంది.
మూడు తరాలుగా ఉద్యమాలు చేస్తున్నా తెలంగాణ ద్రోహులు, టీడీపీ, కాంగ్రెస్ నాయకుల వల్లే తెలంగాణ సాధ్యం కాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చి అధికారంలోకి వచ్చాక అవకాశవాద రాజకీయాలు చేయడం యూపీఏకు చెల్లిందని ఎద్దేవా చేశారు.
త్రిదండి చినజీయర్ స్వామి వ్రతం చెడగొట్టుకున్నా ఫలితం మాత్రం దక్కలేదు. మంటప నిర్మాణం పూర్తయ్యే వరకు మూలమూర్తి దర్శనం చేసుకోనని భీష్మించిన చినజీయర్ భీష్మఏకాదశిన ఉత్సవమూర్తినైనా దర్శించుకోవాలని తలంచారు. అయితే రాంగ్ రూట్ లో తిరుమలకు చేరుకున్నా ఆయనకు శ్రీనివాసుడి దర్శనభాగ్యం మాత్రం దక్కలేదు.
అనంతపురం టిడిపిలో సరికొత్త రాజకీయాలకు తెరలేచింది. పరిటాల రవి తనయుడు శ్రీరాం రాకతో ఆ వర్గం నేతలంతా ఉత్సాహంగా ఉన్నారు. అయితే మరోవర్గం నేతలకు మాత్రం ఇది మింగుడు పడటం లేదు. దీంతో అనంతపురం జిల్లాలో గ్రూప్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి.