హోంమంత్రి పదవి కోసం దామోదర రాజనర్సింహ లాబీయింగ్
హోంమంత్రి పదవి కోసం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. నిన్న అహ్మద్ పటేల్ ని కలిసి ఇదే విషయం పై చర్చించారు. సోనియా అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు హోంమంత్రి పదవిని సునీతా లక్ష్మారెడ్డికి ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.