Next


ఈ రోజు ప్రశ్న
అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసం వెనుక రాజకీయకుట్ర ఉందని భావిస్తున్నారా..?
a. అవును
b. కాదు

    

Result Charts: Pie, Vertical Bar
జాతీయ వార్తలు
Photo

యాంత్రిక్స్ దేవాస్ ఒప్పందంలో దోషి మాధవన్ నాయర్: తేల్చి చెప్పిన ఐదుగురు సభ్యుల కమిటీ

    యాంత్రిక్స్ - దేవాస్ ఒప్పందంలో చోటు చేసుకున్న అవకతవకల పై ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో అవకతవకలకు బాధ్యులెవరో తేల్చి చెప్పింది. ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన ఇస్రో మాజీ ఛైర్మన్ జి.మాధవన్ నాయర్  ప్రధాన దోషిగా కమిటీ నిర్దారించింది. నాయర్ తో బాటు ఈ డీల్ లో  మరో ముగ్గురు శాస్త్రవేత్తల ప్రమేయం ఉన్నట్టు తెలపింది.

   ఈ ఒప్పందంలో భాగంగా ఎస్-బాండ్ రేడియో తరంగాలను కేటాయింపుల్లో ఇస్రో నిబంధనలను ఉల్లంఘించినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజానిజాల పై కమిటీ సమగ్ర నివేదిక సమర్పించింది.. ఇస్రో ఛైర్మన్ గా మాధవన్ నాయర్ ఉన్న సమయంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో సైంటిఫిక్ సెక్రటరీ కె.భాస్కర నారాయణ, యాంత్రిక్స్ మాజీ ఎండీ కేఆర్.శ్రీధరమూర్తి, ఇస్రో వాణిజ్య విభాగం, ఇస్రో శాటిలైట్ సెంటర్ మాజీ డైరక్టర్ కేఎన్.శంకర్ ల పాత్ర కూడా ఉందని కమిటీ తెలిపింది.

   ఈ విచారణ కేంద్ర విజిలెన్స్ మాజీ కమిషనర్ ప్రత్యూష సిన్హా నేతృత్వంలో జరిగింది. అయితే ఈ ఆరోపణలను నాయర్ ఖండిస్తున్నారు. కమిటీ ఒకే కోణంలో దర్యాప్తు చేసిందన్నారు. నిబంధనల్లో ఉన్న అసలు విషయాలను మరచిందన్నారు.

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు ఆంత్రిక్స్ దేవాస్ సంస్థల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాల్లో జరిగిన అవకతవకలకు ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయరే కారణమని విచారణ కమిటీ తేల్చి చెప్పింది. నాయర్ తో బాటు మరో ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా ఈ ఒప్పందంలో కీలకపాత్రపోషించినట్టు కమిటీ నిర్ధారించింది.
ఉత్తరప్రదేశ్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీలన్నీ ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ , బిజీపీలు మాయవతి అవినీతి పాలననే టార్గెట్ చేసుకుని ప్రచారం సాగిస్తున్నాయి. గత ఐదేళ్లలో మాయావతి ఒక్క గ్రామాన్ని కూడా సందర్శించిన పాపాన పోలేదంటూ రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి స్టార్ అట్రాక్షన్ గా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ సైతం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గెలిచే సత్తా ఉండడమే రాజకీయాల్లో క్వాలిఫికేషన్. మర్డర్లు, కిడ్నాపు కేసులున్నా సరే గెలిచే సత్తా ఉన్నవారికే పార్టీ టికెట్లు దక్కుతాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలంటే పరిస్థితి చెప్పక్కర్లేదు. ఈసారి ఎన్నికల బరిలో మొత్తం 35శాతం మంది నేరగాళ్లు పోటీ చేస్తున్నట్లు నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ వెల్లడించింది. మరోవైపు అవినీతి పరులకూ, నేరచరితులకూ ఓట్లెయ్యద్దంటూ అన్నా టీమ్ యూపీలో విస్తృతంగా పర్యటిస్తోంది.
2జీ స్పెక్ట్రం కేసులో హోం మంత్రి చిదంబరాన్ని సహనిందితుడిగా చేర్చమంటూ జనతా పార్టీ అధ్యక్షుడు సుభ్రమణ్యస్వామి వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టేయడాన్ని ప్రణబ్ ముఖర్జీ స్వాగతించారు. పాటియాలా కోర్టు ఇచ్చిన తీర్పు ఒక మంచి తీర్పుగా అభివర్ణించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇది యూపీఏ ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారడంతో కోర్టు తీర్పుతో ప్రభుత్వ ఊపిరి పీల్చుకుంది.
మరో వైపు యూపీఏ సర్కార్ కు మళ్లీ కొత్త చిక్కొచ్చిపడింది. ఇప్పుడే 2జీ వ్యవహారంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న యూపీఏ సర్కార్ కు కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ పై వస్తున్న అవినీతి ఆరోపణలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.