Next


ఈ రోజు ప్రశ్న
జగన్ ను ఒంటరి చేసేందుకు కాంగ్రెస్ అ‎ధిష్టానం కుట్రపన్నుతుందా..?
a. అవును
b. కాదు

    

Result Charts: Pie, Vertical Bar
జాతీయ వార్తలు
Photo

బీహార్ అసెంబ్లీ పోరుకు రంగం సిద్ధం: ఆరు దశల్లో ఎన్నికలు జరపాలని ఎలక్షన్ కమీషన్ నిర్ణయం

 బీహార్ అసెంబ్లీ పోరుకు రంగం సిద్ధమైంది. ఆరు దశల్లో ఎన్నికలు జరపాలని ఎలక్షన్ కమీషన్ నిర్ణయించింది. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు ఆరు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 24న ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తామని కమీషన్ తెల్పింది. కేంద్ర,రాష్ట్ర బలగాలతో ఎన్నికలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేయునున్నట్లు చెప్పింది.  

బీహార్ అసెంబ్లీ పోరుకు రంగం సిద్ధమైంది. ఆరు దశల్లో ఎన్నికలు జరపాలని ఎలక్షన్ కమీషన్ నిర్ణయించింది. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు ఆరు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 24న ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తామని కమీషన్ తెల్పింది.
బీహార్ లో ఎనిమిదిరోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. నలుగురు పోలీసులను బందీలుగా పట్టుకున్న మావోయిస్టులు ఒకరిని చంపి మిగిలిన ముగ్గుర్ని వదిలిపెట్టారు. వీరి విడుదలను అధికారులు ధృవీకరించారు.
విద్యాసంస్థలో ర్యాగింగ్ సంస్కృతి పెరిగిపోతుండడంపై రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విష సంస్కృతిని అంతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఉత్తరప్రదేశ్ అజాంగఢ్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ స్కూలు వ్యానులో గ్యాస్ కిట్ పేలి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12మంది విద్యార్ధులు సజీవ దహనమయ్యారు. మరో 22మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి.
మురికివాడల్లోని జనాభా వేగంగా పెరిగిపోతోంది. 2011 కల్లా అక్కడి జనాభా పదికోట్లకు పైగా చేరుకోనుంది. అంటే దేశ జనాభాలో నాలుగో వంతు ప్రజలకు మురికివాడలే ఆశ్రయం కానున్నాయి. అక్కడి జనసంఖ్య పెరుగుతుందే కానీ... జీవన ప్రమాణాలు మాత్రం మెరుగుపడటం లేదు.