Next


ఈ రోజు ప్రశ్న
అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసం వెనుక రాజకీయకుట్ర ఉందని భావిస్తున్నారా..?
a. అవును
b. కాదు

    

Result Charts: Pie, Vertical Bar
రాజకీయం
Photo

కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనమై ఏడాది పూర్తి

   పిఆర్పీ కాంగ్రెస్ లో విలీనమై ఏడాది పూర్తయినా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆ భావన పూర్థిస్థాయిలో నెలకొనలేదు. ప్రజారాజ్యం నేతలను వారు  నాయకులుగా అంగీకరించలేకపోతున్నారు. దీనికి ఉదాహారణే మంత్రి సి రామచంద్రయ్యకు లభించిన స్వాగతం ఘటన. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. తొలిసారి సొంత నియోజకవర్గం వెళ్లేందుకు ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.

    అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. అయితే స్వాగతం పలికినవారంతా పిఆర్పీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కార్యకర్తలే.  కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరుకాకపోవడం.. పార్టీలో వారి విలీన పరిస్థితిని తెలియజేస్తోంది. రామచంద్రయ్య చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. అందుకే.. జిల్లా కాంగ్రెస్ నేతలు ఎందరు వ్యతిరేకించినా పట్టుబట్టి అధిష్ఠానంతో మాట్లాడి మంత్రి పదవి ఇప్పించారు. అయితే.. చిరు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోనే కాంగ్రెస్, పిఆర్పి శ్రేణులు విడిగా ఉండటం కలవరానికి గురిచేస్తోంది.

  గతంలో చిరంజీవి వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిన నేపథ్యంలో పిఆర్పీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. అయితే బయట మాట్లాడ్డానికి సిద్ధపడకపోయినా చిరంజీవి దృష్టికి మాత్రం తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అవసరమైతే పిసిసి నుంచి ప్రత్యేక ఆదేశాలు కూడా ఇప్పించాలని చిరును కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి క్యాడర్  ప్రవర్తనతో పార్టీకి కొత్తచిక్కులు వచ్చిపడేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

No img
కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనమై ఏడాది పూర్తయింది. మనషులు కలిసినా మనుసులు మాత్రం కలవలేదు. విలీనానికి బహుమతిగా కాంగ్రెస్ అధిష్టానం మంత్రిపదవులు కట్టబెట్టినా ద్వితీయశ్రేణి నేతలు వారిని నాయకులుగా అంగీకరించలేకపోతున్నారు. వెరసి మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా సొంత నియోజకవర్గానికి వచ్చిన రామచంద్రయ్యకు లభించిన ఘనస్వాగతం పిఆర్పీ క్యాడర్ కే పరిమితమైంది.
No img
రాయదుర్గంలో ఉపఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై వేటు ఖాయమని భావిస్తున్న పార్టీలు నియోజకవర్గంలో ఎలాగైనా పాగావేయాలని భావిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తులు కూడా ప్రారంభించాయి.
No img
నెల్లూరు జిల్లా కోవూరు ఉపసమరానికి నేతలు సిద్ధమయ్యారు. ప్రచారాన్ని వేగవంతం చేసి పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఖరారయ్యేలోపు నియోజక వర్గంపై పట్టుసాధించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
No img
ప్రభుత్వ ఉత్తర్వులను వెలువరిచిన మంత్రులను వదిలి తమకు శిక్షేంటన్న ఐఏఎస్ అధికారుల వాదనతో రాజకీయ నాయకులు విభేదిస్తున్నారు. మంత్రుల ప్రాపకం కోసం అవినీతి అని తెలిసినా వారికి వంతపాడి తప్పులు బయటపడగానే మంత్రుల పైకి నెట్టేసి చేతులు దులుపుకోవాలనడం సరికాదంటున్నారు. మంత్రులు చెప్పినట్టు చేయడానికి ఐఏఎస్ స్థాయి అధికారులే కానవసరం లేదని.. మామూలు క్లారికల్ గ్రేడ్ ఉద్యోగులు సరిపోతారంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మంత్రులకు తానా అంటే తందానా అనడం మానాలని హితవు పలుకుతున్నారు.
No img
తెలంగాణపై జాతీయ స్థాయి సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు.