సీఎం కేసీఆర్‎కు ఉత్తమ్ బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్‎కు ఉత్తమ్ బహిరంగ లేఖ
x
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్‎కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‎లో రెండు నెలలుగా వరద నీటితో ఇబ్బందులు పడుతున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రిని కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‎కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‎లో రెండు నెలలుగా వరద నీటితో ఇబ్బందులు పడుతున్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రిని కోరారు. రెండునెలలుగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిథిలోని పలు కాలనీలు వరదనీటిలోనే ఉన్నాయని, వెయ్యికి పైగా ఇళ్లు నీట మునిగి అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వరద బాధితులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఆ లేఖలో ఉత్తమ్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories