టీఎస్‌ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియలో స్వల్ప మార్పులు

టీఎస్‌ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియలో స్వల్ప మార్పులు
x
Highlights

ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎంసెట్‌–2020 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 9 నుంచి ఆన్‌లైన్‌...

ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎంసెట్‌–2020 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 9 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియలు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మొదలు కాగా, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ సోమవారం (ఈనెల 12న) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇటు కాలేజీలకు యూనివర్సిటీ అఫిలియేషన్‌ జారీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం, ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సులకు ఇంకా ప్రభుత్వ అను మతి రాకపోవడంతో అధికారులు కౌన్సెలింగ్‌ తేదీల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. ఈనెల 18వ తేదీ నుంచి వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకునేలా వెబ్‌సైట్‌లో అధికారులు మార్పులు చేశారు. 18వ తేదీన మొదలుకానున్న వెబ్ ఆప్షన్లు ఈనెల 22వరకు ఇచ్చేలా వీలు కల్పించారు. అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్లు ఫ్రీజ్‌ కావడంతో ఈనెల 24న సీట్ల అలాట్‌మెంట్‌ పూర్తవుతుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 28వ తేదీ వరకు కాలేజీలో ట్యూషన్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియ, సెల్ఫ్‌ రిపోర్టింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్‌ రూపొందించారు.

ఇక పోతే రాష్ట్ర వ్యాప్తంగా 201 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ కోర్సుల్లో 1,10,873 సీట్లున్నాయి. ప్రతి ఒక్క కళాశాల యాజమాన్యం ఏటా యూనివర్సిటీ అఫిలియేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఈ అఫిలియేషన్‌ ప్రక్రియ మే నెలాఖరు నాటికే పూర్తవుతుండటంతో ఆ తర్వాత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ఈ కాలేజీల పేర్లు కనిపిస్తాయి. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న కాలేజీలే కౌన్సెలింగ్‌లో పాల్గొంటాయి. ప్రస్తుతం ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అఫిలియేషన్‌ ప్రక్రియ పూర్తికాలేదు. మరోవైపు రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలు 2020–21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కోర్సులు, సీట్లను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. దీంతో వారం పాటు ఆప్షన్‌ల నమోదను వారం పాటు వాయిదా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories