నిజామాబాద్‌ జిల్లాలో టెన్షన్.. టెన్షన్..

Tension Prevails In Nizamabad District
x

నిజామాబాద్‌ జిల్లాలో టెన్షన్.. టెన్షన్..

Highlights

Bodhan: బోధన్‌ బంద్‌కు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు, బీజేపీ శివసేన.

Bodhan: నిజామాబాద్‌ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న బోధన్‌లో ‍ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడంతో.. హిందూ సంఘాలు, బీజేపీ శివసేన కార్యకర్తలు.. బంద్‌కు పిలుపునిచ్చారు. విగ్రహ ఏర్పాటులో పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేయనున్నారు. మరోవైపు.. ఈ బంద్‌కు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. బోధన్‌, నిజామాబాద్‌లో బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్ట్‌లు చేస్తున్నారు. అదనపు డీజీపీ సహా నాలుగు జిల్లాల పోలీస్‌ అధికారులు బోధన్‌లోనే మకాం వేసి.. పరిస్థితులను సమీక్షిస్తున్నారు. పట్టణానికి అదనపు బలగాలను రప్పిస్తున్నారు. ఎక్కడికక్కడ పికెటింగ్‌ ఏర్పాటు చేసి.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. పట్టణంలో 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories