ఆ ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy Sensational Comments MLAs Who Left Congress After Win
x

రేవంత్ రెడ్డి(ఫైల్ ఇమేజ్ )

Highlights

Revanth reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్‌ చేశారు.

Revanth reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలన్నారు. అలా కొట్టడంలో తాను ముందుంటానన్నారు. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే అధికార పార్టీకి అమ్ముడుపోయే సన్నాసులకు సిగ్గు ఉండాలన్నారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే దీనిపై న్యాయపోరాటానికైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. కేసీఆర్ పశువులను కొన్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడని మండిపడ్డారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యే రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికలకు రావాలన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా ప్రజలకు సోనిమాపై నమ్మకం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories