Kishan Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతున్నారు

Rahul Gandhi And Revanth Reddy Are Telling A Lie Over And Over Again Says Kishan Reddy
x

Kishan Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతున్నారు

Highlights

Kishan Reddy: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ సర్కార్

Kishan Reddy: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రిజర్వేషన్ ఫైట్ తారాస్థాయికి చేరింది. బీజేపీపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి ఓటేస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తొలగిస్తుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని విష ప్రచారం చేశారని, ఇప్పుడేమో మోడీ రిజర్వేషన్లను తొలగిస్తారని అసత్య మాటలు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అసలు తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ సర్కార్ అన్నారాయన. మత పరమైన రిజర్వేషన్లు తీసుకొచ్చి.. రాజ్యాంగాన్ని అవమానించారని కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories