హాజీపూర్ సైకో ఎంతమందిని చంపాడు ?

హాజీపూర్ సైకో ఎంతమందిని చంపాడు ?
x
Highlights

ముగ్గురు యువతలను అతి కిరాతకంగా చంపినా హాజీపూర్ సైకో ఇంకా ఎంత మందిని చంపాడు అన్న నేపధ్యంలో పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తున్నారు . బావిలో...

ముగ్గురు యువతలను అతి కిరాతకంగా చంపినా హాజీపూర్ సైకో ఇంకా ఎంత మందిని చంపాడు అన్న నేపధ్యంలో పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తున్నారు . బావిలో నుండి ఒక్కో శవం బయటకు రావడంతో హాజీపూర్ గ్రామస్తులను షాక్ కి గురి చేసాయి . శ్రీనివాస్ రెడ్డి ఈ నాలుగు హత్యలే చేసాడంటే నమ్మడం కష్టంగానే ఉంది . ఎందుకంటే సొంత ఊరిలోనే ఇంతా మందిని పొట్టన పెట్టుకున్న ఈ సైకో పక్క ఉరిలో ఇంకేంతమందిని చంపాడో అతను నోరు విప్పితే కానీ తెలియదు .

అయితే శ్రీనివాస్ రెడ్డి నేర చరిత్రలో ఇంకా ఎన్నో మర్డర్ లు దాగి ఉన్నాయన్న సందేహం కలుగుతుంది . ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి పోలిసుల విచారంలో నోరు మెదపకపోవడం ఈ సందేహలకు మరింత బలం చేకురుస్తున్నాయి . ముగ్గురు అమ్మాయలని అతి ఘోరంగా చంపేయడంతో అతన్ని ఉరితియాలని పలు సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తునాయి .. ఈ నేపధ్యంలో ఇంకిన్ని నేరాలు చేసానని ఒప్పుకుంటే మరిన్ని శిక్షలు అనుభవించాల్సి వస్తుందన్న భయంతోనే శ్రీనివాస్ రెడ్డి నోరు తెరవడం లేదని పోలీసులు భావిస్తున్నారు .

లిఫ్ట్ మెకానిక్ గా కేరియర్ మొదలు పెట్టిన శ్రీనివాస్ రెడ్డి తెలంగాణాలోని నిజామాబాద్ , ఆదిలాబాద్ ,వేములవాడలోని ప్రాంతాల్లో పనిచేసాడు . అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పనిచేసాడు. జరిగిన మూడు హత్యలు మాత్రమే కాకుండా కర్నూల్ జిల్లాలో స్నేహితులతో తెచ్చుకున్న చెందిన ఓ వ్యభిచారిని కూడా హత్యచేసిన కేసు బయటకు వచ్చింది . శ్రావణి కేసులో భాగంగా కర్నూల్ ఘటన బయటకు వచ్చింది . ఇంకా ఇలాంటి మిస్సింగ్ కేసులు ఎన్ని ఉన్నాయో అన్నది అతి పెద్ద సస్పెన్స్ ..

శ్రీనివాస్ రెడ్డి పనిచేసిన అన్ని ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులను పోలీసులు రీ ఇన్వెస్టింగ్ చేస్తున్నారు . ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యలను మరియు స్నేహితులను విచారించగా ఎం ఫలితం లేకుండా పోయింది . అందుకే శ్రీనివాస్ రెడ్డిని మరోసారి కస్టడిలోకి తీసుకోని విచారిస్తే ఏమైనా సమాచారం దొరకవచ్చని పోలీసులు భావిస్తున్నారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories