టీఆర్‌ఎస్ లో చేరనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

టీఆర్‌ఎస్ లో చేరనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
x
Highlights

కాంగ్రెస్‌కు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు టీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోగా తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ...

కాంగ్రెస్‌కు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు టీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోగా తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యే చిరుముర్తి లింగయ్య టీఆర్ఎస్ లో చేరనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు లింగయ్య. కొంతకాలంగా కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.

టీఆరెస్ లో చేరుతున్నట్టు శనివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీఆరెస్ ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పధకాలు, అభివృద్ధి చూసి తాను త్వరలో ఆ పార్టీలో చేరుతున్నాని ప్రకటించారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి గెలవడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే లింగయ్య చెప్పారు. ఇక ఆయన చేరికతో కోమటిరెడ్డి బ్రదర్స్ కు షాక్ తగిలినట్లయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories