ఈడీ విచారణపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తానన్న రోహిత్ రెడ్డి

MLA Rohith Reddy Fire on BJP
x

ఈడీ విచారణపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తానన్న రోహిత్ రెడ్డి

Highlights

Rohith Reddy: బీజేపీ బండారాన్ని బయటపెట్టినందుకు ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నారు

Rohith Reddy: బీజేపీపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫైరయ్యారు. కావాలనే తనను తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. బీజేపీ బండారాన్ని బయటపెట్టినందుకు ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. తనకు ఈడీ పంపిన నోటీసుల్లో ఏ వివరాలు అడగలేదని కేవలం తన, తన కుటుంబ ఆస్తులు అడుగుతూ ఈడీ నోటీసులు ఇచ్చిందని వివరించారు. నందకుమార్‌ ద్వారా నచ్చిన స్టేట్‌మెంట్ తీసుకొని ఈడీ ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. నందకుమార్‌తో స్టేట్‌మెంట్ తారుమారు చేయబోతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న ఎమ్మెల్యే కంప్లైంట్ చేసిన వారిని ప్రశ్నించారు కానీ నిందితులను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. బీఎల్ సంతోష్‌ లాగా తాను విచారణను తప్పించుకోలేదని బీజేపీ నేతలు తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు. తనకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఫిర్యాదు దారుడిగా ఉన్న తనపై ఈడీ విచారణపై, హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తానని రోహిత్ రెడ్డి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories