కేటీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌ ట్వీట్‌ వార్‌

Minister KTR Vs TPCC Cheif Revanth Reddy Tweet War | TS News Today
x

కేటీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌ ట్వీట్‌ వార్‌

Highlights

Revanth Reddy Vs KTR: మంత్రి కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చిన పీసీసీ చీఫ్‌ రేవంత్‌

Revanth Reddy Vs KTR: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మధ్య యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై ట్వీట్‌వార్‌ జరుగుతోంది. 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌, రైతులకు కనీసం ఆరుగంటలు కూడా విద్యుత్‌ను సరఫరా చేయలేకపోయిందని ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. అయితే మంత్రికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్‌కు ఉన్న నిబద్ధత మంత్రి కేటీఆర్‌కు తెలియకపోవడం బాధాకరమని రేవంత్‌ అన్నారు.

కాంగ్రెస్‌ కృషి గురించి మీ తండ్రిని అడగడం మంచిదంటూ ట్విటర్‌ వేదికగా చురకలు వేశారు. రైతు సమస్యల పరిష్కారానికి బదులు రాజకీయం చేయడంలో మీ తండ్రి బిజీగా ఉండొచ్చని వ్యవసాయ రంగంలో కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. హరిత విప్లవం, వ్యవసాయ భూమి సీలింగ్ చట్టం వంటి వాటిని రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హాయంలో 7వేల మందికి రైతుల ఉసురు తీసుకుందని ఆరోపించారు. ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిరాకరించి బిజెపితో ఫిక్స్‌డ్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories