Komati Reddy: రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు

Minister Komatireddy  Visit To Nalgonda Miryalaguda
x

Komati Reddy: రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు

Highlights

Komati Reddy: రైతులకు పంట నష్ట పరిహారం అందిస్తాం

Komati Reddy: రైతుల్ని రైస్‌ మిల్లర్లు ఇబ్బందిపెడితే సహించేది లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మిర్యాల గూడలో పర్యటించిన మంత్రి రోడ్లపై వడ్లు ఆరబోసిన రైతులతో కాసేపు ముచ్చటించారు. రైస్ మిల్లర్లు సరైన ధర కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారులతో మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టే రైస్‌ మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories