Harish Rao: ఇబ్రహింపట్నం ఘటన దురదృష్టకరం

Minister Harish Rao Said Ibrahimpatnam incident is Unfortunate
x

Harish Rao: ఇబ్రహింపట్నం ఘటన దురదృష్టకరం

Highlights

Harish Rao: అపోలోలో 13 మంది, నిమ్స్‌లో 17 మంది మహిళలకు చికిత్స

Harish Rao: ఇబ్రహింపట్నం ఘటన దురదృష్టకరమన్నారు మంత్రి హరీష్‌రావు. అపోలోలో 13 మంది, నిమ్స్‌లో 17 మంది మహిళలకు చికిత్స కొనసాగుతుందని చెప్పారు. అందరి ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారు. బాధితులందరికి ఉచిత వైద్య సాయం అందిస్తున్నామని తెలిపారు. ఇవాళ, రేపు దశలవారీగా డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఈ ఘటనలో నలుగురు చనిపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ సర్వీస్.. జీవిత కాలం సస్పెండ్ చేశామని చెప్పారు. మిగతా వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని.. DH ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేశామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హరీష్‌రావు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories