ఎంపీ అర్వింద్‌పై దాడి కేసులో ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

Lok Sabha Privileges Committee Respond on Dharmapuri Arvind Complaint
x

ఎంపీ అర్వింద్‌పై దాడి కేసులో ప్రివిలేజ్ కమిటీ నోటీసులు 

Highlights

Privileges Committee: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఆర్మూర్‌లో దాడి కేసుకు సంబంధించి పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.

Privileges Committee: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఆర్మూర్‌లో దాడి కేసుకు సంబంధించి పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ సీఎస్‌, డీజీపీ, నిజామాబాద్ సీపీ, కలెక్టర్‌కు నోటీసులు జారీ అయ్యాయి. జనవరి 25న తనపై జరిగిన దాడికి సంబంధించి లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ అర్వింద్ లేఖ రాశారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడమే కాకుండా దాడికి పాల్పడ్డారని అర్వింద్ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. దాడి దాడికి సంబంధించి నివేదిక 15 రోజుల్లో స్పీకర్‌కు అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories