Kishan Reddy: అమ్మవారి ఆలయాన్ని శుభ్రం చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy Cleaned Sri Kanaka Durga Nagalakshmi Temple
x

Kishan Reddy: అమ్మవారి ఆలయాన్ని శుభ్రం చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Highlights

Kishan Reddy: ఆలయ గోపురాలను కడిగి విగ్రహ మూర్తులను శుద్ధి చేసిన కిషన్‌రెడ్డి

Kishan Reddy: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా.. ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్‌ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆలయ పరిసరాలను చీపురుతో ఊడ్చి.. తన చేతులతో చెత్తను ఎత్తి పారబోశారు. నీటితో ఆలయ గోపురాల్ని కడిగారు. అనంతరం స్వయంగా విగ్రహ మూర్తులను శుద్ధి చేశారు కిషన్‌రెడ్డి. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories