Praneeth Rao: ప్రణీత్‌రావు పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు

High Court Verdict On Praneeth Rao Petition Today
x

Praneeth Rao: ప్రణీత్‌రావు పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు 

Highlights

Praneeth Rao: నిన్న తీర్పు రిజర్వ్‌ చేసిన తెలంగాణ హైకోర్టు

Praneeth Rao: SIB మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు పిటిషన్‌పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తు్న్నారు. కాగా ప్రణీత్‌రావు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్‌ చేయగా...నేడు తీర్పు వెల్లువరించనుంది. కాగా కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తెలంగాణ హైకోర్టు ఆశ్రయించాడు. నాంపల్లి కోర్టు విధించిన వారం రోజుల పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కిందికోర్టు పోలీస్ కస్టడీకి ఇచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. కస్టడీ సమయంలో సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదన్నారు. దర్యాప్తు అనంతరం పోలీస్ స్టేషన్‌లో పడుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని పిటిషన్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. కస్టడీలో భాగంగా రోజు పోలీసులు విచారణ ముగిసిన తర్వాత తనను పోలీస్ స్టేషన్‌లో కాకుండా జైలుకు తరలించేలా ఆదేశాలివ్వాలని కోరారు. బంధువులు, తన న్యాయవాదులను కలిసేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వట్లేదని ప్రణీత్‌రావు పిటిషన్ దాఖలు చేశారు.

గత ప్రభుత్వం హయాంలో ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతల ఫోన్లు ట్యాప్ చేసిన ఆరోపణలపై ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ప్రణీత్ రావును వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఈ కస్టడీని సవాల్ చేస్తూ అతడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో నిన్న హైకోర్టులో విచారణ జరగగా..కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పును నేడు కోర్టు వెల్లువరచనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories