శంషాబాద్‌లో ఇంజినీర్ కిడ్నాప్ కలకలం.. రూ.23లక్షలు బాకీ ఉన్నట్టు బాండ్ పేపర్‌పై సంతకాలు

Engineer Kidnapped in Shamshabad
x

శంషాబాద్‌లో ఇంజినీర్ కిడ్నాప్ కలకలం.. రూ.23లక్షలు బాకీ ఉన్నట్టు బాండ్ పేపర్‌పై సంతకాలు

Highlights

Engineer: శంషాబాద్ లో ఇంజినీర్ కిడ్నాప్ కలకలం రేపింది.

Engineer: శంషాబాద్ లో ఇంజినీర్ కిడ్నాప్ కలకలం రేపింది. ఐదు గంటల పాటు కారులో తిప్పుతూ దుండగులు చితకబాదారు. హిమయత్ నగర్ కు చెందిన చిరంజీవి గతంలో భగీరథ ఇంజినీరింగ్ కంపెనీలో ఇంజినీర్ గా పని చేసి ఏడాది క్రితం పని మానేశాడు. ప్రస్తుతం నేషనల్ హైవే డిపార్ట్ మెంట్లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈనెల 12న భగీరథ ఇంజినీర్ కంపెనీలో పనిచేసే కృష్ణ, చంద్రశేఖర్, సుధాకర్ తో పాటు మరో వ్యక్తి మధురా నగర్ నుండి చిరంజీవిని కారులో బలవంతంగా ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. పీవీఆర్ ఎక్స్ ప్రెస్ వేపై తిప్పుతూ చితకబాదారు. శంషాబాద్ లోని రాధా హీరో హోండా సర్వీసింగ్ సెంటర్ లోని రూములో బంధించి బలవంతంగా బాండ్ పేపర్ పై 23లక్షలు అప్పు ఉన్నట్లు సంతకాలు పెట్టించుకున్నారు. దీంతో బాధితుడు చిరంజీవి శుక్రవారం ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories