Manda Krishna: హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళిత బంధు

Dalita Bandhu is For Huzurabad By-Elections Says Manda Krishna
x

మంద కృష్ణ (ఫైల్ ఇమేజ్)

Highlights

Manda Krishna: దమ్ముంటే వంద రోజుల్లో దళిత బంధు అమలు చేయాలి * లేకుంటే రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం : మంద కృష్ణ

Manda Krishna: హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళితబంధు పథకాన్నితెరపైకి తెచ్చారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.వందరోజుల్లో సంపూర్ణంగా దళితబంధు అమలుచేయాలని డిమాండ్చేశారు. లేదంటే సీఎం కేసీఆర్ ను దళిత సమాజం రాజకీయంగా బొంద పెడుతుందని హెచ్చరించారు.కేసీఆర్ ఏడేండ్ల పాలనలో మోసం,దగా, వంచన చేశారని ఆరోపించారు. హైదరబాద్ వరద బాధితులను మోసం చేసినా కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తారనే నమ్మకంలేదన్నారు.

దళిత సమాజాన్నిచైతన్యం చేసేందుకే సమగ్ర అభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.త్వరలో హుజూరాబాద్ నియోజకవర్గం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మందకృష్ణమాదిగ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories