Khuntia Fires on BJP: దేశంలో బీజేపీ వల్లే రాజ్యాంగానికి ముప్పు: కుంతియా

Khuntia Fires on BJP: దేశంలో బీజేపీ వల్లే రాజ్యాంగానికి ముప్పు: కుంతియా
x
Highlights

khuntia fires on BJP: దేశంలో బీజేపీ వల్ల రాజ్యాంగానికి వ్యవస్థలకు ముప్పు వచ్చిందని టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్.సి.కుంతియా విమర్శించారు....

khuntia fires on BJP: దేశంలో బీజేపీ వల్ల రాజ్యాంగానికి వ్యవస్థలకు ముప్పు వచ్చిందని టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్.సి.కుంతియా విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రతిపక్ష రాష్ట్రంలో ప్రభుత్వాలను కూల్చి వేస్తుందని కుంతియా అన్నారు. బీజేపీ సొంత పార్టీ సభ్యుల బలం లేకుండా అధికారపక్ష సభ్యులను తమ వైపు తిప్పుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తోందని ఆయన ఆరోపించారు.

దేశంలో కరోనాతో లాక్ డాన్ కొనసాగుతున్న సమయంలో బీజేపీ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి మంత్రివర్గం అసెంబ్లీ సమావేశంలో బలనిరూపణ చేసుకోవడానికి అనుమతించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాజ్యాంగంలో ముఖ్యమంత్రి మంత్రివర్గం నిర్ణయం మేరకు గవర్నర్ నడుచుకోవాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అధికార దుర్వినియోగం చేస్తూ... సంఖ్యా బలం ఉన్న రాష్ట్రాల ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చడం ఆపాలన్నారు. వెంటనే రాజస్థాన్ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి సంఖ్యా బలం నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కుంతియా డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories