టీఆర్‌ఎస్‌ని కొట్టే సత్తా బీజేపీకే ఉంది.. కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

టీఆర్‌ఎస్‌ని కొట్టే సత్తా బీజేపీకే ఉంది.. కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

GHMC ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వస్తున్న ఫలితాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర...

GHMC ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వస్తున్న ఫలితాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని అర్ధమౌతున్నట్లు తెలుస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కోగల పార్టీ కేవలం బీజేపీయేనని ప్రజలు నమ్ముతున్నారని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అయితే ఓ కాంగ్రెస్ నేత మరో పార్టీని ప్రశంసించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే విశ్వేశ్వరరెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.




Show Full Article
Print Article
Next Story
More Stories