ఏపీ సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు..

ఏపీ సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు..
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబుపై హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ లో కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డేటా చౌర్యం కేసుపై చంద్రబాబు.. ప్రజలను రెచ్చగొట్టే...

ఏపీ సీఎం చంద్రబాబుపై హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ లో కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డేటా చౌర్యం కేసుపై చంద్రబాబు.. ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని.. డేటా చౌర్యం సమస్యను రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా వ్యక్తిగత సమాచారాన్ని సేవా మిత్ర యాప్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులు తస్కరించారని లోకేష్ రెడ్డి అనే వ్యక్తి ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ కేసును ట్రాన్స్ఫర్ చేశారు.

ఇప్పటికే కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ కంపెనీ యజమాని అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఏపీలో ప్రజాధారణ లేని వైసీపీని అడ్డదారిలో అధికారంలోకి తీసుకురావడానికి టీఆరెస్ ప్రయత్నిస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories