సెల్ కల్చర్ తో కరోనాకు చెక్ !

సెల్ కల్చర్ తో కరోనాకు చెక్ !
x
Highlights

విశ్వవ్యాప్తంగా కరోనా కట్టడికి ఔషధ ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే వాటిని మానవాళిపై ప్రయోగిస్తే ప్రాణాలకు ముప్పు ఉండటంతో ఆ దిశగా ప్రయత్నాలకు ఇప్పటికీ...

విశ్వవ్యాప్తంగా కరోనా కట్టడికి ఔషధ ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే వాటిని మానవాళిపై ప్రయోగిస్తే ప్రాణాలకు ముప్పు ఉండటంతో ఆ దిశగా ప్రయత్నాలకు ఇప్పటికీ ముందడుగు పడలేదు. దీంతో ఔషధ ప్రయోగాలకు సదుపాయాన్ని కల్పించే ప్రయత్నాలు చేస్తోంది సీసీఎంబీ. సెల్ కల్చర్ తో ఆ అవకాశాన్ని కల్పిస్తామంటోంది.

రోజురోజుకూ విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గతంలో వచ్చిన వైరస్ ల కంటే కరోనా చైన్ సిస్టమ్ అత్యంత వేగంగా పనిచేస్తుండటంతో రోజుకు వేల కొద్దీ బాధితులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. కరోనాను అంతం చేసేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నా మానవాళిపై ఔషధ ప్రయోగానికి ధైర్యం చేయటం లేదు. దీంతో సీసీఎంబీ ఔషధ ప్రయోగాలకు ఊతమిచ్చే ప్రయత్నాలు చేస్తోంది.

కరోనా వైరస్ జన్యు క్రమం తెలుసుకునేందుకు సెల్ కల్చర్ ను వినియోగిస్తోంది సీసీఎంబీ. ఇందులో కృత్రిమ వాతావరణాన్ని ఏర్పాటు చేసి నియంత్రిత పరిస్థితుల్లో మానవ కణాలను పెంచి అందులో వైరస్ వృద్ధి చెందేలా చేస్తారు. అరచేతి పరిమాణంలో ఉండే మైక్రో టైప్ ప్లేట్ లో మొదట కణాలను వృద్ధి చేస్తారు. ఇందులో ఒకే సారి 24 కణాలు వృద్ధి చెందుతాయి. ఆ తర్వాత కణాల్లోకి వైరస్ ను ప్రశేపెడతారు. ఇలా వైరస్ జన్యుక్రమాన్ని రూపొందించనున్నారు శాస్త్రవేత్తలు.

సెల్ కల్చర్ తో కృత్రిమంగా పెంచిన కణాలపై కరోనా కోసం తయారు చేస్తోన్న ఔషధాలను ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాలతో నిర్ధారితం కాని ఔషధాల నుంచి కొన్ని ప్రాణాలు కాపాడినట్లవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం సెల్ కల్చర్ అడ్వాన్స్ దశలో ఉందని తెలిపారు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా. ఈ ప్రయోగాలకు వైరస్ తీవ్రత ఎక్కువ ఉన్న శాంపిల్స్ ను ఇతర కేంద్రాల నుంచి కూడా సేకరిస్తోంది సీసీఎంబీ. వైరస్ నమూనాలు పంపాలని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ను కోరింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories