Nalgonda: అదుపుతప్పి బోల్తా పడ్డ బస్సు.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు

Bus Accident in Nalgonda
x

Nalgonda: అదుపుతప్పి బోల్తా పడ్డ బస్సు.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు 

Highlights

Nalgonda: ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు

Nalgonda: నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఘోర ప్రమాదం తప్పింది. అదుపుతప్పి ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా వినుకొండలో వివాహానికి హాజరై.. తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories